ఈ మధ్య కాలంలో తిరుమలలో వివాహం చేసుకునే వారి సంఖ్య పెరుగుతోందనీ వారి కోసం తిరుపతిలో వివాహవేదిక నిర్మించాలని ప్రతిపాదించామని పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ వెల్లడించారు. వివాహం అనంతరం కొత్త దంపతులు, ఇరువైపుల తల్లిదండ్రులు మొత్తం ఆరుగురికి తిరుమలలో వీఐపీ దర్శనం ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలలో పొందుపరుస్తున్నామని వెల్లడించారు.