నటనకు బై బై...? దర్శకత్వంపై ఏంజిలీ దృష్టి..!

సోమవారం, 24 నవంబరు 2014 (09:57 IST)
హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఏంజిలీనా జోలీ నటనకు బై బై చెప్పనుందట. ఇప్పుడు ఆమె దృష్టి నటన నుంచి దర్శకత్వం వైపు మళ్లిందని హాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. 
 
అందుకు అనుగుణంగానే ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి. ఆమె మాట్లాడుతూ అసలు తనకు కెమెరా ముందు నిలబడటం కంటే మెగా ఫోన్ చేతిలో పట్టుకోవడమంటేనే ఇష్టమంటోంది. 
 
ఇక నుంచి పూర్తి స్థాయిలో ఫిల్మ్ మేకింగ్ పై దృష్టి పెడతా. దర్శకత్వ శాఖలో కూడా రాణిస్తానని ఆశిస్తున్నా అని ఏంజిలీనా స్పష్టం చేసింది.
 
కాగా చివరిసారిగా ఏంజిలీనా 'మేల్ ఫీసెంట్'  చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. గత మే నెల్లో విడుదలైన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కుమ్మరించింది.

వెబ్దునియా పై చదవండి