ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుని.. తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయినప్పటికీ తన నృత్యంతో ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన మైకేల్ జాక్సన్ అంటే తెలియనివారుండరు. అలాంటి కళాకారుడిని పితృదినోత్సవం సందర్భంగా ఆయన సంతానం పట్టించుకోలేదని విమర్శలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. తండ్రిగా ఆయన సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించినా.. ఆయనను గుర్తు చేసుకుని పిల్లలు లేరని సోషల్ మీడియా ఫాదర్స్ డే సందర్భంగా నెటిజన్లు ఫైర్ అయ్యారు.
అయితే మైకేల్ జాక్సన్ కుమార్తె పారిస్ జాక్సన్ ఈ వార్తలపై ఫైర్ అయ్యింది. ఆదివారం (జూన్-19) ఫాదర్స్ డే కావడంతో చాలామంది సెలెబ్రిటీలు తమ తండ్రితో కూడిన ఫోటలను పోస్ట్ చేస్తూ.. సోషల్ మీడియాలో హంగామా చేశారు. అయితే పారిస్ మాత్రం ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. దీంతో మైకెల్కి వీరాభిమానులైన కొంతమంది నెటిజన్లు పారిస్ను విమర్శిస్తూ పోస్టు చేశారు.