కావలసిన పదార్థాలు : మునక్కాడలు.. ఒక కప్పు అరటిముక్కలు.. ఒక కప్పు బూడిదగుమ్మడి ముక్కలు.. ఒక కప్పు గోరుచిక్కుడు ముక్కలు.. ఒక కప్పు కందముక్కలు.. ఒక కప్పు కొబ్బరితురుము.. ఒక కప్పు కొత్తిమీర తరుగు.. రెండు కప్పులు పెరుగు.. ఒక కప్పు పచ్చిమిర్చి.. పది కొబ్బరినూనె.. 2 టీ. ఉప్పు.. తగినంత
తయారీ విధానం : కూరగాయ ముక్కలన్నింటినీ ఉడికించి ఉంచాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, పెరుగులను మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఉడికించిన కూరగాయ ముక్కలను ఒక గిన్నెలో వేసి స్టౌమీద ఉంచాలి. నీరంతా ఇగిరిపోయాక ఉప్పు, గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి బాగా కలియబెట్టాలి. మిశ్రమం దగ్గరయ్యేంతదాకా అలాగే ఉడికించి.. కొబ్బరినూనె వేసి బాగా కలియదిప్పి దించేయాలి. అంతే కేరళ ప్రజలు చాలా ఇష్టంగా తినే వెజ్ అవియల్ రెడీ..!