కావలసిన పదార్థాలు : జొన్నలు.. అర కేజీ బియ్యంపిండి.. వంద గ్రా. ఉల్లిపాయలు.. 8 పచ్చిమిర్చి.. 4 ఉప్పు.. తగినంత నూనె.. సరిపడా
తయారీ విధానం : జొన్నల్ని నానబెట్టుకోవాలి. తరువాత వాటిని శుభ్రంగా కడిగి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పిండికి బియ్యంపిండి, తగినంత ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగులను వేసి బాగా కలియబెట్టాలి. ఈ పిండిని ఓ గంటసేపు అలాగే ఉంచేయాలి.
తరువాత స్టవ్పై దోశెల పెనం పెట్టి.. వేడయ్యాక తగినంత నూనె వేసి పై మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేస్తూ దోశెల్లాగా పోయాలి. తగినంత నూనెతో ఈ దోశెలను రెండువైపులా కాల్చి తీసేయాలి. అంతే వేడి వేడి జొన్న దోశెలు సిద్ధం.. రుచికి రుచిని, బలానికి బలాన్నిచ్చే ఈ దోశెలను రాయలసీమ ప్రజలు చాలా ఇష్టంగా ఆరగిస్తుంటారు. మరి మీరూ..?!