కావలసిన పదార్థాలు : శెనగలు.. పావు కేజీ అల్లం వెల్లుల్లి.. అర టీ. నల్ల ఉప్పు.. పది గ్రా. కొత్తిమీర.. ఒక కట్ట టీపొడి.. రెండు టీ. ఉప్పు.. తగినంత ఉల్లిపాయలు.. 50 గ్రా. మిరియాలపొడి.. ఒక టీ. కారం.. ఒక టీ. నిమ్మకాయ.. ఒకటి నూనె.. తగినంత
తయారీ విధానం : శెనగలను నాలుగ్గంటలసేపు నీటిలో నానబెట్టి.. టీపొడి కలిపి మెత్తగా ఉడికించి నీటిని వంపేసి శనగలను వేరు చేసుకోవాలి. ఒక గిన్నెలో నూనె పోసి కాగిన తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఎర్రగా వేయించాలి. ఆపై అల్లం వెల్లుల్లి ముద్ద, మిరియాలపొడి, పైన చెప్పుకున్న మిగతా పదార్థాలన్నింటినీ వేసి, కలిపి వేయించాలి.
ఇప్పుడు శనగలను కూడా వేసి బాగా కలియబెట్టాలి. ఈ శనగల్లో కొన్నింటిని విడిగాతీసి పిండిలాగా మెత్తగా రుబ్బి వేగుతున్న మిశ్రమంలో కలిపితే పిండిచోలే తయార్..! దీనిపై నిమ్మముక్కలు, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి.. పూరీతోగానీ, చపాతీగానీ అతిథులకు అందించండి.