తయారీ విధానం :
ముందుగా వెడల్పాటి గిన్నెలో శనగపిండి, ఉల్లి తురుము, అల్లం, మిర్చి పేస్టు, ఉప్పు వేసి ఈ మిశ్రమంలో సరిపడినన్ని నీళ్ళ పోసి కలుపుకోవాలి. బ్రెడ్ స్లైసుల చివర్లు కట్చేసి వాటిని మజ్జిగలో ముంచి రెండు నిమిషాల తర్వాత నీటిని పిండి పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్ ముద్దను శనగపిండి మిశ్రమంలో అద్ది ఆపై ఆయిల్లో దోరగా వేయించాలి. వేడిగా వున్నప్పుడే చిల్లీసాస్ లేదా టమాటో సాస్లతో కలిపి పిల్లలకు సర్వ్ చేస్తే.. పిల్లలు ఇష్టపడి తింటారు.