కావలసిన పదార్థాలు : బంగాళాదుంపలు.. అర కేజీ అల్లంవెల్లుల్లి.. ఒక టీ. పచ్చిమిర్చి.. ఏడు పసుపు.. పావు టీ. కరివేపాకు.. ఒక కట్ట నిమ్మకాయలు.. రెండు కొబ్బరిపాలు.. 3 గ్లాసులు నూనె.. 4 టీ. ఉప్పు.. తగినంత
తయారీ విధానం : బంగాళాదుంపలను మెత్తగా ఉడికించి పొట్టు తీసి ముక్కలుగా కోయాలి. ఓ గిన్నె తీసుకుని స్టవ్మీద పెట్టి కొంచెం నూనె వేసి అల్లంవెల్లుల్లి ముద్దను వేసి వేయించాలి. తరువాత పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, ఆలుగడ్డలు, జీడిపప్పు అన్నీ వేసి కలపాలి. ఆపై కొబ్బరిపాలు కూడా పోసి ఉడికించాలి. చివర్లో కరివేపాకు కూడా వేసి ఉప్పు సరిచూసి దించి నిమ్మరసం పిండాలి. అంతే ఆలూ.. జీడిపప్పు రెడీ.. ఇది ఆప్పంలోకి, దోసెల్లోకి చాలా రుచిగా ఉంటుంది.