కావలసిన పదార్థాలు : క్యాబేజీ, క్యారెట్ తరుగు.. రెండేసి కప్పులు ఉల్లిపొరక తరుగు.. ఒక కప్పు పచ్చిమిర్చి తరుగు.. ఒక టీ. వెల్లుల్లి తరుగు.. రెండు టీ. మొక్కజొన్న పిండి.. అర కప్పు సోయాసాస్.. ఒక టీ. ఉప్పు.. తగినంత మిరియాలపొడి, పంచదార.. చెరో టీ. అజినమోటో.. చిటికెడు నూనె.. సరిపడా కొత్తిమీర తరుగు.. కాస్తంత
తయారీ విధానం : క్యాబేజీ, క్యారెట్ ముక్కల్ని కలిపి గట్టిగా పిండి వాటిల్లోని నీరు తీసేయాలి. వీటికి మొక్కజొన్నపిండి, ఉప్పు చేర్చి గట్టిగా కలపాలి. సాధ్యమైనంత వరకు నీరు అవసరం లేదు. ఈ పిండిని చిన్నచిన్న ఉండల్లా చేసి నూనెలో బంగారువర్ణంలోకి వచ్చేదాకా వేయించాలి.
ఇప్పుడు అదే బాణలిలో రెండు టీస్పూన్ల నూనె వేడిచేసి వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపొరక తరుగుల్ని వేసి వేయించాలి. కొద్దిగా నీళ్లుపోసి ఉప్పు, మిరియాలపొడి, అజినమోటో, పంచదార, సోయాసాస్ కలపాలి. ఐదు నిమిషాలయ్యాక ముందుగా వేయించి పెట్టుకున్న ఉండల్ని ఈ మిశ్రమంలో వేయాలి. సన్నని మంటపై ఉంచి కలుపుతూ ఉండాలి. ఐదు నిమిషాల తరువాత దించేసి.. సర్వ్ చేసే ముందుగా ఉల్లిపొరక, కొత్తిమీర తరుగులతో అలంకరిస్తే.. వెజ్ మంచూరియా తయార్..!