కావలసిన పదార్థాలు : లేత వంకాయలు.. 200 గ్రా. గోరుచిక్కుళ్లు.. 50 గ్రా. బంగాళాదుంపలు.. వంద గ్రా. క్యారెట్.. రెండు దుంపలు మునక్కాయలు.. ఆరు చింతపండు.. 25 గ్రా. కందిపప్పు.. వంద గ్రా. బియ్యం.. ఒక కిలో నూనె.. వంద గ్రా. ఎండుమిర్చి.. ఆరు నెయ్యి.. గరిటెడు లవంగాలు.. పది దాల్చినచెక్క, ఉప్పు, పసుపు, కరివేపాకు.. తగినంత పచ్చి శనగపప్పు.. 50 గ్రా. ధనియాలు.. ఒక టీ.
తయారీ విధానం : ముందుగా కూరగాయలన్నింటినీ చిన్నసైజు ముక్కల్లాగా తరిగి ఉంచాలి. బాణలిలో తగినంత నూనె పోసి.. కూరగాయల ముక్కల్ని వేసి బాగా వేయించి రెండు గ్లాసుల నీటిని పోయాలి. పసుపు, ఉప్పు వేసి మూతపెట్టి ఉడికించాలి. ఈలోగా కుక్కర్లో బియ్యం, కందిపప్పులను విడి విడిగా ఉడికించి ఉంచాలి. అలాగే శనగపప్పు, మిర్చి, మసాలా దినుసులన్నింటినీ దోరగా వేయించి పొడి చేసుకోవాలి.
ఇప్పుడు ఓ వెడల్పాటి గిన్నెలో అన్నం, పప్పు, ఉడికించిన కూరగాయల ముక్కలు, మసాలా పొడిని వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోనే చింతపండు పిసికిన నీటిని, తగినంత ఉప్పు, నెయ్యి, పసుప్పొడిని వేసి గరిటె జారుగా అయ్యేటట్లుగా కలపాలి. దీన్ని కాసేపు స్టౌమీద ఉంచి వేడి చేయాలి. దించేముందు నెయ్యితో పోపుపెట్టిన కరివేపాకును వేసి కలపాలి. అంతే బిసిబేళాబాత్ తయార్.. కన్నడ ప్రజలకు చాలా ప్రీతిపాత్రమైన.. ఈ వంటకాన్ని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.