కావలసిన పదార్థాలు : పకోడీ... పావు కేజీ గడ్డ పెరుగు.. అర కేజీ జీలకర్ర.. ఒక టీ. ఆవాలు.. ఒక టీ. కరివేపాకు.. తగినంత నూనె.. నాలుగు టీ. ఉల్లి, పచ్చిమిర్చి తరుగు.. అర కప్పు పసుపు.. చిటికెడు కొత్తిమీర, పుదీనా తరుగు.. ఒక కప్పు ధనియాలు.. ఒక టీ. దాల్చిన చెక్క... ఒకటి లవంగాలు.. పది యాలకులు.. ఐదు
తయారీ విధానం : ఒక పాత్రలో నాలుగు టీస్పూన్ల నూనె వేసి సన్నటి సెగపై బాగా కాగనివ్వాలి. తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు, పసుపు, ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. అందులో ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులతో కలిపి కొట్టిన మసాలా పొడిని వేసి కలపాలి.
ఆపై గడ్డపెరుగును కూడా వేసి బాగా కలియబెట్టి రెండు నిమిషాలయ్యాక కిందికి దించేసి దాంట్లోనే పకోడీని వేసి బాగా కలియబెట్టాలి. ఆపై కొత్తిమీర, పుదీనా తరుగును చల్లి పైన మూత పెట్టాలి. అంతే పకోడీ కడ్స్ ఖురమై సిద్ధం..! దీనిని కొద్దిగా చల్లారిన తరువాత తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ వంటకాన్ని అన్నంలోకి, బ్రెడ్, చపాతీ, పూరీల్లో కూడా కలిపి తినవచ్చు.