కావలసిన పదార్థాలు : బియ్యంపిండి.. 4 గ్లాసులు శెనగపప్పు.. 150 గ్రా. పచ్చిమిర్చి.. పదిహేను వెన్న.. చిన్న గిన్నెడు కరివేపాకు.. పది రెబ్బలు నూనె.. తగినంత ఉప్పు.. సరిపడా
తయారీ విధానం : పచ్చిమిర్చిని సన్నగా తరిగి ఉంచాలి. శెనగపప్పును కడిగి నీటిలో గంటసేపు నానబెట్టాలి. శెనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కల్ని బియ్యంపిండిలో వేసి బాగా కలియబెట్టాలి. వెన్నపూసను కరిగించి కొద్ది కొద్దిగా పిండిలో పోస్తూ బాగా మెత్తగా కలపాలి. ఆపై కాసిన్ని నీళ్లు పోసి పిండి.. చపాతీ పిండిలాగా అయ్యేలా చేయాలి.
ఇప్పుడు స్టవ్మీద బాణలిపెట్టి తగినంత నూనె పోయాలి. నూనె బాగా కాగిన తరువాత ఓ ప్లాస్టిక్ కవర్ పైన నూనె రాసి పిండి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని గుండ్రంగా నొక్కి నూనెలో వేసి ఎర్రగా వేయించి తీసేయాలి. అంతే తపాళ చెక్కలు తయార్.! మంచి రుచిగా, కరకరలాడుతూ ఉండే ఈ తపాళ చెక్కలు వర్షాకాలంలో మంచి స్నాక్స్గా పనికివస్తాయి.