అఫ్గాన్‌లో జరిగిన దాడిలో ఐఎస్ఐ ప్రమేయం!

ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని భారత దౌత్య కార్యాలయంపై శుక్రవారం జరిగిన ఆత్మాహుతిదాడిలో పాక్ నిఘా సంస్థ ఇంటర్‌ సర్వీసెస్ ఇంటలిజెన్స్ (ఐఎస్ఐ) హస్తముందని ఆఫ్గన్ రాయబారి అమెరికాలో తెలిపారు.

ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని భారత దౌత్య కార్యాలయంపై శుక్రవారం జరిగిన ఆత్మాహుతిదాడిలో ఐఎస్ఐ ప్రమేయం ఉందని ఆఫ్గన్ రాయబారి జావేద్ తెలిపారు. ఈ దాడిలో 17మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

ఈ దాడుల వెనుక ఐఎస్ఐ ప్రమేయం ఉందని నిరూపించేందుకు తమ వద్ద అన్ని రకాల ఆధారాలున్నాయని ఆయన పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి