అబుదాబీలో రోడ్డు ప్రమాదం: మృతులంతా భారతీయులే!

గురువారం, 1 ఏప్రియల్ 2010 (12:58 IST)
అబుదాబీ సమీపంలో రెండు రోజుల క్రితం జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారు భారతీయులుగా గుర్తించారు. అబుదాబీలోని రువెయిస్ అనే ప్రాంతంలో గత నెల 29వ తేదీన బస్సు, లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఇందులో ఆరుగురు దుర్మరణం చెందగా 44 మంది ప్రాణాలు కోల్పోయారు.

యూఏఈలోని ఖయాతీ అనే చమురు శుద్ధీకరణ కంపెనీకి చెందిన బస్సు ఒకటి సిబ్బందిని తీసుకుని కంపెనీకి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రాజారెడ్డి (29), రాజేష్ కుమార్ (33), రంగనాథన్ చిన్న శెట్టి (48), వినోద్ కుమార్ (39), శ్రీని నాగళ్ళ (33), పొట్టిరాజా (37)లు మృతి చెందారు. వీరంతా భారతీయులుగా గుర్తించినట్టు దుబాయ్ పోలీసులు వెల్లడించారు.

అయితే, ఈ మృతదేహాలను తీసుకునేందుకు కార్మికులు పని చేస్తున్న చమురు కంపెనీ యాజమాన్యం ముందుకు రాలేదు. దీంతో దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని దుబాయ్ పోలీసులు సంప్రదించి, మృతుల సొంత ఊర్లకు మృతదేహాలను పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్‌ అని గుర్తు చేశారు.

వెబ్దునియా పై చదవండి