అల్‌ఖైదా, తాలిబాన్లకు పాకిస్థాన్ స్వర్గధామం

అల్ ఖైదా, తాలిబాన్ తీవ్రవాద సంస్థలు పాకిస్థాన్‌లోని స్వర్గధామాల నుంచి ప్రపంచానికి తీవ్ర ముప్పుగా పరిణమించాయని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో అల్ ఖైదా, తాలిబాన్ తీవ్రవాదులకు స్వర్గధామాలుగా ఉన్నాయని, వాటి నుంచే తీవ్రవాదులు ప్రపంచానికి సవాలు విసురుతున్నారని ఒబామా చెప్పారు.

ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాల్లో భద్రతా పరిస్థితులు తక్షణ చర్యలను డిమాండ్ చేస్తున్నాయన్నారు. ఆఫ్ఘన్-పాకిస్థాన్ గిరిజన ప్రాంతాల్లో ఏర్పరుచుకున్న సురక్షిత ప్రదేశాల నుంచి అల్ ఖైదా అమెరికాకు ముప్పుగా మారిందని, తాలిబాన్లు ఇక్కడ నుంచి తిరిగి పుంజుకుంటున్నారని ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసికి రాసిన లేఖలో బరాక్ ఒబామా పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి