పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్ దేశాలలో అల్ఖైదా, తాలిబన్ ఉగ్రవాదుల బెడద పట్టి పీడిస్తోంది. ఈ ప్రాంతాల్లో ఆత్మాహుతి దళాలు సంచరిస్తున్నట్లు గూఢచారి వర్గాలు ప్రభుత్వానికి సూచించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది.
ఇదిలావుండగా ప్రస్తుతం ఇస్లామాబాద్ తదితర ప్రాంతాలలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టి, సోదాలు ముమ్మరం చేశారు. కాగా పాకిస్థాన్ దేశంలో ఉన్న అమెరికన్లు జాగ్రత్తగా ఉండాలని అమెరికా ప్రభుత్వం వారికి హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాకిస్థాన్లోని దౌత్య కార్యాలయాన్నికూడా మూసివేశారు.