ఐరాస చీఫ్ పదవికి మళ్లీ పోటీ చేస్తా: బాన్ కీ మూన్

ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి పదవికి మళ్లీ పోటీ చేస్తానని ప్రస్తుత చీఫ్ బాన్ కీ మూన్ ప్రకటించారు. వచ్చే యేడాది జరిగే ఎన్నికలో పోటీ చేసి మరో ఐదేళ్ళ పాటు సమితి సేవలు అందించాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు.

దీనిపై దక్షిణ కొరియా జాతీయుడైన మూన్‌ మాట్లాడుతూ.. మరో ఐదేళ్ళ పాటు సమితి ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించాలన్న కోర్కె ఉన్నట్టు తెలిపారు. ఇదిలావుండగా, ఐరాసకి అధిపతిగా పని చేసిన వారిలో మూన్‌ ఎనిమిదో వ్యక్తి.

2012-16 కాలానికి ఐరాసకి నేతృత్వం వహించేందుకు పోటీ పడుతున్న ఒకే ఒక అధికారి మూన్‌ కావడం విశేషం. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే అంశంపై తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరుతూ ఐరాస సర్వప్రతినిధి సభకు లేఖ రాసినట్టు ఆయన చెప్పారు.

వెబ్దునియా పై చదవండి