ఢిల్లీ-కేరళ-గోవాల్లో పేదల సంఖ్య తక్కువ: యూఎన్‌డీపీ

భారత్‌లోని రాష్ట్రాల్లో ఢిల్లీ, కేరళ, గోవా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పేదలు గణనీయ సంఖ్యలో తక్కువగా ఉన్నట్టు ఐక్యరాజ్య సమితికి చెందిన డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ (యూఎన్‌డీపీ) వెల్లడించింది. ఈ సంస్థ, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి తాజాగా ఒక సర్వే నిర్వహించింది.

అలాగే, తమిళనాడు, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో పేదల సంఖ్య మరీ అంత ఎక్కువ కాకుండా తక్కువ సంఖ్యలో ఉన్నట్టు తెలిపింది. అదేసమయంలో ప్రపంచంలోనే అత్యంత పేదరికం తాండవిస్తున్న రీజియన్‌లలో దక్షిణాసియా ఒకటని పేర్కొంది. ఇందులో బంగ్లాదేశ్‌లో 58 శాతం, భారత్‌లో 55 శాతం, నేపాల్‌లో 65 శాతం చొప్పున పేదలు ఉన్నట్టు యూఎన్‌డీపీ పేర్కొంది.

ఆఫ్రికా ఖండంలోని 26 దేశాల్లో నివశించే 410 మిలియనల్ ప్రజల కంటే.. భారత్‌లోని రాష్ట్రాల్లో ఎనిమిదింటిలో నివశించే 421 మిలియన్ల ప్రజలు ఎక్కువ పేదరికంలో జీవిస్తున్నట్టు ఆ సర్వే తెలిపింది. దాయాది దేశమైన పాకిస్థాన్‌లో పేదలు 51 శాతం ఉన్నట్టు సర్వే తెలిపింది.

వెబ్దునియా పై చదవండి