భారత్‌లో దాడులకు తీవ్రవాదుల పన్నాగం: అమెరికా

ఆదివారం, 13 సెప్టెంబరు 2009 (15:53 IST)
భారత్‌లో పండుగ సీజన్ ఆరంభమైందని, ఈ సమయాన్ని ఆసరాగా చేసుకుని తీవ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయని అమెరికా పేర్కొంది. అందువల్ల భారత నిఘా వర్గాలతో పాటు.. భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలని అమెరికా సూచించింది.

రంజాన్, దసరా, దీపావళి, క్రిస్మస్ వంటి పండుగలు వరుసగా వస్తున్నాయని తీవ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అందువల్ల భారత్‌లోని వివిధ ప్రాంతాలకు పర్యటనకు వెళ్లే అమెరికా పౌరులు జాగ్రత్తగా మసలుకోవాలని విజ్ఞప్తి చేసింది.

ప్రార్థనా మందిరాలు, ఆలయాలు, మసీదులు, హోటల్స్, బీచ్‌లు తదితర పర్యాటక ప్రాంతాలకు వెళ్లే సమయంలో అత్యంత జాగరూకతతో ఉండాలని కోరినట్టు అమెరికా ఏజెన్సీ న్యూస్ కథనాలు పేర్కొంటున్నాయి.

వెబ్దునియా పై చదవండి