మాల్దీవుల గుండా తీవ్రవాద చొరబాట్లు: అమెరికా

తీవ్రవాదులు అప్పుడప్పుడు తమ కార్యకలాపాల కోసం మాల్దీవుల భూభాగాన్ని కూడా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అమెరికా అధికారిక యంత్రాంగంలోని ఓ ఉన్నతాధికారి గురువారం వెల్లడించారు. మాల్దీవులను అప్పుడప్పుడు తీవ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించుకునే ప్రయత్నం జరుగుతున్న విషయాన్ని గమనించాము.

అందువలన మాల్దీవుల యంత్రాంగం వారి భూభాగాన్ని పర్యవేక్షించేందుకు అమెరికా సాయం అవసరమని ఆ దేశ ఉన్నతాధికారి రాబర్ట్ బ్లేక్ తెలిపారు. మాల్దీవులు చాలా సవాళ్లు ఎదుర్కొంటుంది. వీటిలో మొదటిది మాల్దీవుల భూభాగాన్ని తీవ్రవాదులు ఉపయోగించుకుంటున్నారు. దీని గుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని రాబర్ట్ బ్లేక్ వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి