లోయలో పడిన బస్సు : 44 మంది మృతి, 46 మందికి గాయాలు

FILE
లాటిన్‌ అమెరికాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 44 మంది మృతి చెందగా, 46 మంది తీవ్రంగా గాయపడ్డారు. మంగ్వాటెమాలలో బస్సు అదుపుతప్పి 660 మీటర్ల ఎత్తునుండి లోయలో పడటంతో ఈ ప్రమాదం జరిగింది.

క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రాజధాని గ్వాటెమాలకు 60 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి విచారణ జరుగుతుందని వారు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి