విమానాలు ఆలస్యంగా నడిచే దేశాల్లో భారత్ ఫస్ట్!

సోమవారం, 25 జనవరి 2010 (19:04 IST)
లోహ విహాంగాలకు ప్రపంచ దేశాల సరిహద్దులు చెరిపేసేవిగా పేరుంది. కానీ భారత్‌ ప్రభుత్వం నడుపుతున్న విమానాలు మాత్రం ఆలస్యంగా నడిచే జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాయి. నిర్ధిష్టమైన సమయపాలన పాటించని విమాన సర్వీసులుగా భారత విమానాలుగా పేరుగాంచాయి.

అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక ఫోర్బ్స్ నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం వెల్లడించింది. పలు దేశాలు నడుపుతున్న విమాన సర్వీసుల రాకపోకల సమయాలపై ఈ పత్రిక తాజాగా ఒక సర్వే నిర్వహించింది. ఇందులో ఖచ్చితమైన సమయ పాలన పాటించని దేశాల జాబితాలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ద్వితీయ స్థానంలో చైనా ఉన్నట్టు ఆ పత్రిక పేర్కొంది.

భారతదేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు వాణిజ్య రాజధాని ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రాలకు వచ్చే విమానాలన్నీ ఆలస్యంగానే నడుస్తున్నట్టు ఆ పత్రిక నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అలాగే, మిగిలిన నగరాల్లోని విమానాశ్రయాల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉన్నట్టు ఆ పత్రిక పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి