స్వైన్‌ఫ్లూ బారినపడ్డ కొలంబియా అధ్యక్షుడు

కొలంబియా అధ్యక్షుడు అల్వరో యూరీబ్‌ స్వైన్‌ఫ్లూ మహమ్మారి బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయనకు అధికారిక వైద్యులు చికిత్సనందిస్తున్నారని కొలంబియా సామాజిక రక్షణ శాఖామంత్రి డియేగో పైలేసియో తెలిపారు.

తమ దేశ అధ్యక్షుడు స్వైన్‌ఫ్లూ బారిన పడినప్పటికీ, ఆ వ్యాధి అంత తీవ్రంగా లేదని మంత్రి తెలిపారు. ఆయన శుక్రవారం ఈ వ్యాధిబారిన పడ్డారని మంత్రి వెల్లడించారు. తమ దేశ అధ్యక్షుడు త్వరగా కోలుకుంటారని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

గత శుక్రవారంనాడు అర్జెంటీనాలో జరిగిన దక్షిణ అమెరికా నేతల సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. శనివారానికి ఆయన ఈ మహమ్మారి వ్యాధిబారిన పడ్డారని మంత్రి పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి