సినలోవా నుంచి చెటుమాల్ పట్టణానికి మొసళ్లను తరలిస్తున్నారు. ఈ రెండు ప్రాంతాల మధ్య సుమారు 2600 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంత దూరం సరైన రీతిలో మొసళ్లను తరలించకపోవడం వల్లే 124 జీవాలు ప్రాణం విడిచి ఉంటాయని వన్యపాణి సంస్థ అధికారి తెలిపారు. ఆ కంపెనీపై పర్యావరణశాఖ వన్యప్రాణి చట్టం ప్రకారం భారీ జరిమానా విధించే అవకాశాలున్నాయి.