తైవాన్ భూకంపం ఘటన మరవక ముందే, చిలీ తీర ప్రాంతంలో బుధవారం భూకంపం సంభవించింది. కోక్వింబో తీరంలో ఏర్పడిన ఈ భూకంప తీవ్రత రిక్టర్స్కేల్పై 6.3గా నమోదైనట్టు భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు. భూప్రకంపనలకు భయపడి ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. కాగా, ఈ భూకంప తీవ్రత పొరుగున ఉన్న అర్జెంటీనాను కూడా వణికించింది.