ఇలా భారతదేశం నుంచి వెళ్లిన వారిలో తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందినవారు ఉన్నారని తెలిపింది. ఈ ఏడుగురు కాకుండా మరో ఆరుగురు భారతీయులు ఐఎస్ఐఎస్ తరపున పోరాడుతూ మృత్యువాత పడ్డారని నిఘావర్గాలు వెల్లడించాయి. మరణించిన వారిలో ముగ్గురు ఇండియన్ ముజాహిదీన్కు చెందిన వారు కాగా, ఇద్దరు మహారాష్ట్రకు చెందిన వారు, ఒక వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి చెందినవాడని నిఘావర్గాలు చెప్పాయి.
బతికి ఉన్న ఏడుగురిలో ఒకడ్ని మాత్రమే ఐఎస్ఐఎస్ పోరాటంలో పాల్గొనేందుకు అనుమతిచ్చింది. మిగిలిన ఆరుగురు వంటవాళ్లు, డ్రైవర్లు, పనివాళ్లుగా కుదురుకున్నట్టు నిఘావర్గాలు పేర్కొన్నాయి. కాగా, తెలంగాణ నుంచి సిరియా వెళ్లేందుకు 17 మంది అనుమతి కోరగా, వారంతా ఐఎస్ఐఎస్ లో చేరే ప్రమాదం ఉందని భావించిన అధికారులు వారి అనుమతి నిరాకరించినట్టు నిఘావర్గాలు వెల్లడించాయి.