వాటితో ఇక వారానికి 4 గంటలే పని.. ఎవరు చెప్పారు?

గురువారం, 22 జూన్ 2017 (14:39 IST)
జాక్ మా... చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ అలీబాబా కంపెనీ వ్యవస్థాపకుడు. ఈయన ఆశ్చర్యకరమైన ఓ విషయాన్ని వెల్లడిస్తున్నారు. భవిష్యత్‌లో రోజులో కేవలం నాలుగు గంటలు మాత్రమే పని చేస్తారనని, అలాగే, వారంలో మూడు రోజుల పాటు సెలవు దినాలు అమలవుతాయని చెపుతున్నారు. 
 
డెట్రాయిట్‌లో జరిగిన గేట్‌వే 17 కాన్ఫరెన్సులో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెల్స్ పుణ్యమా అని భవిష్యత్తులో ప్రజల జీవితం మరింత సుఖమయంకానుందని, వచ్చే 30 ఏళ్లలో ప్రజలు రోజుకు కేవలం 4 గంటల మాత్రమే పనిచేస్తారని నేను భావిస్తున్నాను. అదికూడా వారానికి నాలుగు రోజులు మాత్రమే.. అని జాక్ సెలవిస్తున్నారు. 
 
ఆర్టిఫిషియల్ ఇంటిజెన్స్‌పై మరింత వివరంగా మాట్లాడుతూ ఎన్ని మెషిన్లు వచ్చినా అవి ప్రవర్తన విషయంలో మనుషుల పాత్రను భర్తీ చేయలేవన్నారు. అయితే రోజురోజుకూ దూసుకొస్తున్న టెక్నాలజీతో మాత్రం పెను సమస్యలు తప్పవన్నారు. 'మూడోతరం టెక్నాలజీ విప్లవం... మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారితీయవచ్చు' అని ఈ చైనా బిలియనీర్ చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి