నవరాత్రుల సందర్భంగా కఠోర ఉపవాసం ఆచరిస్తున్నాననీ, అందువల్ల తాను విందులో కూర్చున్నప్పటికీ ఆహార పదార్థాలను తినలేనని, మిగతావారు విందును ఆస్వాదించాలని, తాను తినకపోవడాన్ని ఎవరూ అసౌకర్యంగా భావించరాదని వివరణ ఇచ్చుకున్నారు నరేంద్ర మోడీ. ఎంతో రుచికరమైన ఒబామా విందును మోడీ తప్ప అంతా ఆస్వాదించారు. వంటకాలు చాలా బావున్నాయని కితాబిచ్చారు.