గత కొంత కాలంగా గ్రహణం పట్టినట్టు వరుసగా విమానాలు కుప్పకూలుతుంటే, ఇటీవల విమానాలను నడిపే పైలట్లకు మతిచెడినట్టుంది. జర్మన్ వింగ్స్ విమాన పైలెట్ ఉదంతం మరువక ముందే మరో పైలట్ కత్తులు చేతపట్టి కలకలం సృష్టించాడు.
విమానంలో 260 మందికి పైగా ప్రయాణికులున్నారు. ఈ స్థితిలో జర్మన్ వింగ్స్ విమానం ఉదంతం నేపథ్యంలో, సిబ్బందిని తనిఖీ చేస్తుండగా ఈ పైలట్ వద్ద కత్తులు దొరికాయి. దీంతో, అతడిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. అనంతరం బెయిల్పై విడిచిపెట్టారు. ఈ సంఘటన ఆ విమానాశ్రయంలో కలకలం రేపింది.