ఇవు నుంచి లండన్కు చిన్న వస్తువులతో కూడిన ఈ రైలు ప్రయాణాన్ని చైనా రైల్వే ఎక్స్ప్రెస్ సంస్థ తలపెట్టింది. జనవరి 4న మొదలైన ఈ రైలు ప్రయాణం దాదాపు 8 వేల మైళ్ల దూరం ప్రయాణించి రెండున్నర వారాల్లో తన గమ్యాన్ని చేరుకుంటుంది. బ్రెక్సిట్ అనంతరం బ్రిటన్-చైనా మధ్య నెలకొన్న కీలకమైన వాణిజ్య భాగస్వామ్యానికి ఈ సరకుల రవాణా రైలు నాంది పలకనుందని బ్రిటన్ కేంద్రంగా పనిచేసే వన్టూత్రీ లాజిస్టిక్స్ కంపెనీ మేనేజర్ ఆస్కార్ లిన్ పేర్కొన్నారు ఈ రైలులోని సరకుల క్లియరెన్స్, పంపిణీని ఈ కంపెనీ నిర్వహిస్తోంగదని చైనా ప్రభుత్వ అధికార పత్రిక చైనా డైలీ తెలిపింది.
గృహోపకరణాలు, బ్యాగులు, సూట్ కేసులు, ఆభరణాలు తదితర వస్తువులతో కూడిన ఈ రైలు కజికిస్తాన్, రష్యా, బెలారస్, పోలండ్, జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్ దేశాల గుండా ప్రయాణించి చివరకు లండన్ చేరుకుంటుంది. చైనా యూరప్ మధ్య సరకుల రవాణా సేవలను జరపర్చిన 15వ నగరంగా లండన్ కానుందని జిన్హువా పేర్కొంది. వన్ బెల్ట్ వన్ రోడ్ అనే పేరిట చైనా అధ్యక్షుడు గ్జి జింగ్పింగ్ నిర్దేశించిన దార్సనికతలో ఈ రైలు ఒక భాగం. దీన్నే కొత్త సిల్క్ రోడ్ అంటున్నారు. యూరప్, ఆసియా, మధ్యప్రాచ్య దేశాలతో చైనా ఆర్థిక బంధాలను మరింతగా మెరుగుపర్చే మౌలికవసతుల ప్రారంభచర్యల్లో ఈ రైలు ప్రయాణం భాగమై ఉండాలని జింగ్పింగ్ ఆశిస్తున్నారు.