ఇంకా గోవధపై నిషేధం కొనసాగిస్తుందని తెలిపారు. కొంతమంది ఎంపీలు ఒంటి కొమ్ము ఖడ్గమృగాన్ని జాతీయ జంతువుగా సూచించినప్పటికీ, దానికి ఆమోదముద్ర పడలేదు. ఆవునే జాతీయ జంతువుగా ప్రకటించడం జరిగిందని కృష్ణ చెప్పారు. హిందువులకు అనుకూలంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ గోవులకు రాజ్యాంగబద్ధమైన రక్షణ లభిస్తుందని కృష్ణ తెలిపారు.