ఒక ఇంట్లో మనిషి చనిపోయాడంటే ఉండాలంటే భయపడతాం. ఇక ఇంటి కింద శవాన్ని పూడ్చారంటే వణుకు వస్తుంది. మరి శవాలను గృహమే ఉందంటే అమ్మో.. గుండె గుబేళంటుంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 400 మందిని పాతిపెట్టిన భూతగృహమంటే ఇంకేమైనా ఉందా... గుండె ఆగిపోదూ... మరి ఇది నిజమే... ఇలాంటి గృహాన్ని బ్రిటన్ పురావస్తుశాఖ వెలికితీసింది. పైగా అస్తి పంజరాలపై పరిశోధనలు కూడా చేస్తోంది. ఎక్కడా...? రండి తెలుసుకుందాం.
దాదాపు 400 అస్థిపంజరాలు చెక్కుచెదరకుండా ఉండగా,మరిన్ని స్కెలెటన్స్ ఏ భాగానికాభాగం వేరైపోయి ఎముకలే కనిపించాయి. సుమారు మూడేళ్ళ క్రితం ఈ పరిశోధనలు జరిగినా దాన్ని దాచిపెట్టారు. తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టారు. బహుశా మధ్యయుగం నాటి శ్మశానాలతో ఈ ప్రాంతాన్ని పోల్చవచ్చునని వాళ్ళు అంటున్నారు.