అమెరికాలోని జార్జియాలో ఏడు దశాబ్దాల తర్వాత తొలిసారి ఉరిశిక్షను అమలు చేశారు. అదీకూడా ఓ మహిళకు ఈ శిక్షను అమలు చేయడం జరిగింది. తన భర్తను హత్య చేసిన కేసులో ఆమెకు ఈ శిక్షను కోర్టు విధించగా, తాజాగా అమలు చేశారు.
అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో కెల్లీ జస్సెండనర్ అనే 47 ఏళ్ల మహిళ తన భర్త డాగ్లస్ ను కెల్లీని 1997లో హత్య చేసింది. ఈ కేసులో ఆమెకు శిక్ష పడింది. ఈ శిక్షను తప్పించేందుకు న్యాయవాదులు పలు ప్రయత్నాలు చేసినా, పోప్ లేఖ రాసినా ఫలితం లేకపోయింది. అయితే చివరిగా కెల్లి పశ్చాత్తపడిందని ఆమె తరపు న్యాయవాదులు తెలిపారు. తన కారణంగా చనిపోయిన భర్తకు క్షమాపణ కూడా చెప్పిందన్నారు.