ఒడిశాకు చెందిన దనా మాఝీ భార్య శవాన్ని మోస్తూ పది కిలోమీటర్లు నడక సాగించిన ఘటన దేశాన్నే కాదు ప్రపంచం దృష్టినీ ఆకర్షించిన విషయం తెల్సిందే. ఈ విషాద ఘటనతో అనేక చలించి పోయారు. ఒడిషా ప్రభుత్వాన్ని, ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులపై తీవ్రమైన విమర్శలు చేశారు.
అదేసమయంలో ఈ విషాద ఘటన బహ్రెయిన్ రాజకుటుంబీకులను కదిలించింది. భార్య శవాన్ని భుజాలపై మోసుకెళ్తున్న దృశ్యాన్ని చూసి చలించిపోయిన బహ్రెయిన్ ప్రధాని, రాజ కుటుంబీకుడు షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా బాధితుడి కుటుంబ వివరాల కోసం ఆరా తీశారు.