దీపావళికి అధికారికంగా మలేషియా, సింగపూర్, ఫిజి, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, మయన్మార్, మారిషస్, గయానా, ట్రినిడాడ్, టొబాగో, సురినామ్ వంటి దేశాల్లో సెలవు ప్రకటించిన నేపథ్యంలో పాకిస్థాన్లో మాత్రం దీపావళి నాడు హిందువులకు సెలవు లేదు.
ఈ నేపథ్యంలో పాక్ హిందు కౌన్సిల్ పోషకుడు డాక్టర్ రమేశ్ కుమార్ వాంక్వానీతో బాటు, అధికార పార్టీ శాసనసభ్యుడు ఒకరు మాట్లాడుతూ, సెలవు ప్రకటించటం వలన సదరు కమ్యూనిటీకి సాయం చేసినవారవుతారన్నారు. అంతేగాక తాము పాకిస్థానీ దేశభక్తి కలవారమని, వార్షిక పండుగకు సెలవు పొందే హక్కు తమకు రాజ్యాంగం కల్పించిందని అన్నారు.
ఇదే సమయంలో దేశంలో బలవంతపు మతమార్పిడిపై స్పందించిన ఇమ్రాన్... హిందువులు, కలాష్ కమ్యూనిటీలను బలవంతంగా ఇస్లాంలోకి మార్పు చేయడంపై విచారం వ్యక్తం చేశారు. అయితే ఇమ్రాన్ ఖాన్ కామెంట్స్ పాకిస్థాన్లో ఏమాత్రం పనికిరావని రాజకీయ పండితులు అంటున్నారు.