అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను పట్టుకునేందుకు భారత్, అమెరికా సహాయాన్ని కోరనుంది. అమెరికా పర్యటనలో భాగంగా మోడీ, ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగిన మరునాడే, అమెరికా ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
పాక్లో ఉగ్రవాదుల సురక్షిత స్థావరాలను నిర్మూలించాలని మోడీ, ఒబామా భేటీలో ఇరు దేశాలు నిర్ణయించాయి. అంతేగాక, ఆల్ ఖైదా, లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, డి-కంపెనీల ఆర్థిక మూలాలన్నింటిని కూడా స్తంభింపజేయాలని తీర్మానించాయి.