తమిళనాడుకు చెందిన 55 ఏళ్ల కస్తూరి మునిరత్నం అనే మహిళ సౌదీలో ఓ ఇంట్లో పనిమనిషిగా చేస్తోంది. ఇదే ఇంట్లో పై స్థాయి ఉద్యోగంలో మరో వ్యక్తి పని చేస్తున్నాడు. ఆ వ్యక్తికి కస్తూరిపై కన్నుపడింది. తన కోర్కె తీర్చాలంటూ వేధించడం, చిత్రహింసలకు గురి చేస్తూ వచ్చాడు.
ప్రస్తుతం ఆమె రియాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే బాధితురాలిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం చేయాలని బాధిత కుటుంబసభ్యులు కోరుతున్నారు.
కాగా, ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించలేమన్నారు. ఈ విషయాన్ని సౌదీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు ఆమె చెప్పారు. ఒక భారతీయ మహిళను ఇంత దారుణంగా హింసించడం తనను చాలా కలచివేసిందని సుష్మాస్వరాజ్ పేర్కొన్నారు.