పాకిస్థాన్‌పై భారత్ ఇందిరమ్మ సైనిక చర్యను భారత్ అమలు చేస్తుందా?

మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (10:55 IST)
పాకిస్థాన్ అణుశక్తిని సంతరించుకోకుండా ఆ దేశ అణు స్థావరాలపై సైనిక దాడుల దిశగా దివంగత ప్రధాని ఇందిరాగాంధీ సైనిక చర్యను అమలు చేసే దిశ యోచించే అవకాశం ఉందని అమెరికా గూఢచార సంస్థ (సీఐఏ) వెల్లడించిన పత్రాలను బట్టి తెలుస్తోంది.
 
‘ఇండియాస్‌ రియాక్షన్‌ టు న్యూక్లియర్‌ డెవలప్‌మెంట్స్‌ ఇన్‌ పాకిస్థాన్‌’ పేరిట 1981, సెప్టెంబర్‌ 8న తాను రూపొందించిన 12 పేజీల పత్రాన్ని సీఐఏ ఈ ఏడాది జూన్‌లో తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది.

ఇస్లామాబాద్‌ అణ్వాయుధాలను సమకూర్చుకునే సమయం ఇంకెంతో దూరంలో లేదని, 1981లో ఇందిరాగాంధీ భావించారని.. అణుశక్తి సాధన దిశగా పాక్‌ పురోగతితో ఆందోళన చెందారని అందులో పేర్కొంది.
 
పాక్‌ అణ్వాయుధాలను సమకూర్చుకునే విషయంలో అప్పటికి అమెరికా అంచనా కూడా అదే. ఇదే పరిస్థితి మరో రెండు మూడు నెలలపాటు కొనసాగి, పరిస్థితి విషమించితే.. (అప్పటి) ప్రధాని ఇందిరాగాంధీ పాకిస్థాన్‌లోని అణుస్థావరాలపై సైనిక చర్య నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆనాడు సీఐఏ తన నివేదికలో అభిప్రాయపడింది.

వెబ్దునియా పై చదవండి