ఆమె ప్రత్యర్థి డోనాల్డ్ ట్రంప్... చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, మహిళలపై గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగానే ఓడిపోనున్నారని సర్వే పేర్కొంది. ఓ దశలో పోటీ హోరాహోరీగా రూపాంతరం చెందినప్పటికీ, చివరి దశలో ఎఫ్బీఐ ఇచ్చిన క్లీన్ చిట్తో హిల్లరీకి ఆధిక్యం మరింతగా పెరిగిందని వెల్లడించింది.
కాగా, ఎలెక్టోరల్ కాలేజీలో 270 ఓట్లు అవసరం కాగా, హిల్లరీకి 303 ఓట్లు వస్తాయని, తిరుగులేని మెజారిటీతో ఆమె విజయం ఖాయమైందని ప్రకటించింది. కాగా, భారత కాలమానం ప్రకారం మంగళవారం 5 గంటల నుంచి దాదాపు 15 కోట్ల మంది అమెరికన్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్న సంగతి తెలిసిందే.