ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ఆగడాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తమ చేతికి చిక్కిన వారిని చిక్కినట్టుగా అత్యంత కిరాతంగా హతమారుస్తున్నారు. అంతటితో ఆగిపోకుండా తాము సాగించిన మారణకాండ వీడియోలను సామాజిక మాద్యమాల్లో పెట్టి అందరిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తాజాగా ఐసిస్ ఉగ్రవాదులు విడుదల చేసిన వీడియోలు భీతి గొల్పుతున్నాయి.
తమకు చిక్కిన జర్నలిస్టులను ఐసిస్ ఉగ్రవాదులు అత్యంత దారుణంగా హతమార్చారు. జర్నలిస్టుల చేతులను బేడీలతో ఇనుప రెయిలింగ్కు కట్టేసి, మెడకు ఇనుప గొలుసును బిగించి వారిని ఖైదీలుగా బంధించారు. అనంతరం జర్నలిస్టుల కెమెరాలు, ల్యాప్ టాప్ల్లో పేలుడు పదార్థాలు నింపి.. వాటిని వారి మెడలో వేసి పేల్చేశారు. నాలుగో జర్నలిస్టును పదునైన కత్తితో గొంతు కోసి మట్టుబెట్టారు.