ప్రధాని పదవి నుంచి వైదొలిగేందుకు నవాజ్ షరీఫ్ నిరాకరిస్తే తమ మద్దతుదారులు ఇస్లామాబాద్లోని హై-సెక్యూరిటీ రెడ్ జోన్లోకి ప్రవేశించడం ఖాయమని, అవసరమైతే ఈ రోజే అంతిమ పోరాటానికి దిగుతామని ఇమ్రాన్ ఖాన్ పిఎంఎల్-ఎన్ (పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్) ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి ఆపద్ధర్మ పాలకులతో పాటు రిటర్నింగ్ అధికారులతో కుమ్మక్కవడం వల్లనే నవాజ్ షరీఫ్ విజయం సాధించారన్న విషయం అందరికీ తెలుసని, ఈ విజయాన్ని పాక్ ప్రజలెవ్వరూ అంగీకరించడం లేదని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నాడు. ప్రధాని పదవి నుంచి నవాజ్ షరీఫ్ బుధవారంలోగా తప్పుకోవాలంటూ పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ అల్టిమేటం జారీ చేశారు.