ఈ సందర్భంగా, రాజధాని నిర్మాణానికి అవసరమైన మేర ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నా, సర్కారు రైతుల భూములను సేకరిస్తోందని ఆరోపించారు. రైతుల నుంచి సేకరించిన భూములతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన పేర్కొన్నారు.