విషంతో కూడిన ఇంజక్షన్ ఇస్తే, మెల్లగా మత్తులోకి జారుకుని మరణిస్తారని, దీనివల్ల అతి తక్కువ బాధ, మరణానికి చేరువయ్యేందుకు తక్కువ సమయం పడుతుందనే భావనలో చాలా దేశాలు ఈ విధానాన్నే అమలు చేస్తున్నాయి.
అయితే వర్జీనియాలో మరణశిక్షలను విషపు (లెథల్) ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా అమలు చేస్తుండగా, ఇటీవలి కాలంలో ఈ తరహా ఔషధాల లభ్యత మందగించింది. దీంతో వర్జీనియా 'హౌస్ ఆఫ్ డెలిగేట్స్' ఎలక్ట్రిఫికేషన్ వైపు నడుస్తున్నారు. "కోర్టుల నిర్ణయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉండటంతోనే ఈ బిల్లును ప్రవేశపెట్టిన జాక్సన్ హెచ్ మిల్లర్ వ్యాఖ్యానించారు.