బాలికల విద్యాహక్కు ఉద్యమకారిణి, పాక్ సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్పై దాడి చేసిన 10 మంది తాలిబన్ ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్లు పాకిస్థాన్ ఆర్మీ వెల్లడించింది. ఉగ్రవాదులపై దాడిలో భాగంగా పోలీసులు, నిఘా సంస్థలు, సైన్యం జరిపిన ఆపరేషన్లో వారిని అదుపులోకి తీసుకున్నట్లు మేజనర్ జనరల్ అసీం సలీమ్ బాజ్వా చెప్పారు.