ఐక్యరాజ్య సమితి చర్చలో పాల్గొన్న మల్లికా షెరావత్!

శనివారం, 30 ఆగస్టు 2014 (12:38 IST)
బాలీవుడ్ శృంగారతార మల్లికా శరావత్ ఐక్యరాజ్య సమితిలో జరిగిన చర్చలో పాల్గొన్నారు. అమెరికాలో జరుగుతున్న 65వ యూఎన్డీపీఐ/ఎన్జీవో సమావేశంలో 'భారత్‌లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై' ఆమె ప్రసంగించారు. 
 
భారత్‌లో మహిళలపై ఇప్పటికీ కులాధిపత్యం, పురుషాధిపత్యం అధికంగా వున్నాయని మల్లిక అన్నారు. 'ఎన్ సీఆర్ బీఐ' ప్రకారం ప్రతి 20 నిమిషాలకు భారత్‌లో ఓ మహిళ అత్యాచారానికి గురవుతోందని చెప్పారు. 
 
వీటికి తోడు, బాల్య వివాహాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయని అంతర్జాతీయ సమాజం దృష్టికి ఆమె తీసుకెళ్లారు. వీటన్నింటినీ నివారించేందుకు బలమైన చట్టాలను తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి