మార్స్... ధూళి తుఫాను.. ఫోటోలు భూమికి చేరవేత!

బుధవారం, 1 అక్టోబరు 2014 (07:54 IST)
ఈ నెల 24వ తేదీన అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించిన భారత మార్స్ అర్బిటన్ మిషన్ (మామ్) అంగారక గ్రహం తాజా చాయా చిత్రాలను భూమికి చేరవేసింది. ఉపగ్రహంలోని శక్తివంతమైన కెమెరా అంగారకుడి నార్తెన్ హెమీస్ఫియర్ (ఉత్తరార్థ గోళం)లో ధూళి తుఫాను ఫొటోలు తీసింది. ఈ ఫోటోలను మార్స్ సర్ఫేస్‌కి 74,500 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఈ ఫోటోలను తీసింది. తాజాగా మామ్ పంపించిన ధూళి తుఫాన్ ఫోటోలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. 
 
గత గురువారం నాడు అంగారకుడి గ్రహానికి సంబంధించి తొలి విడత ఫోటోలను మామ్ పంపించిన విషయం తెల్సిందే. అరుణ గ్రహం ఉత్తరార్థ గోళంలో ఈ తుఫాను ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. కాగా అరుణ గ్రహం అంతా బంగారుమయం అనే వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో అంగారకుడిపై మీథేన్ జాడలను, ఖనిజాల లభ్యతను మామ్ వెతికే పనిలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. కాగా జీవి బతికేందుకు అనువైన వాయువు మీథేన్ అన్న సంగతి తెలిసిన విషయమే. 
 

వెబ్దునియా పై చదవండి