అయితే, మృతదేహాలను తిరుగుబాటుదారులు ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తమకు అంతుచిక్కడం లేదని ఆ శాఖ పేర్కొంది. విమాన ప్రమాదం తర్వాత మృత దేహాలను తిరుగుబాటుదారులు ట్రక్కుల్లో ఎక్కిస్తుండటాన్ని అసోసియేటెడ్ ప్రెస్ విలేకరులు కూడా చూసినట్లు సమాచారం. తిరుగుబాటుదారులు తీసుకెళ్లగా మిగిలిన మృతదేహాలను ఉక్రెయిన్ అత్యవసర సేవల విభాగం స్వాధీనం చేసుకుంది.