పాకిస్థాన్ ఆలోచనల్ని ఎప్పటికప్పుడు పసిగడుతున్నామని.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 245సార్లు పాకిస్థాన్ వైపు నుంచి కాల్పులు జరిగాయని వెల్లడించారు. గతంలో భారత సైన్యం ఉన్న శిబిరాలపై కాల్పులు జరిగేవని, ఇప్పుడు సామాన్యులు లక్ష్యంగా పాకిస్థాన్ కాల్పులు జరుగుతున్నాయని దల్బీర్ సింగ్ తెలిపారు.
గతవారంలో ఇండియా, పాక్ మధ్య చర్చలు విఫలమైన తరువాత గ్రామాలపై కాల్పులు జరిపి ఇద్దరు మహిళలను బలి చేశారని, 22 మందికి తూటాల గాయాలయ్యాయనే విషయాన్ని గుర్తు చేశారు. పాక్ దురాగతాలను గట్టిగా తిప్పికొడతామని చెప్పారు.