ఈ కాల్పుల అంశంలో పాకిస్థాన్ ఎంతో ఓపికగా వ్యవహరిస్తుండటాన్ని అసమర్థతగా భావించవద్దని షరీఫ్ భారత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమ ఓపికను పరీక్షించొద్దని, తామేమీ చేతగాని వాళ్లం కాదని ఆయన అన్నారు. భారతదేశం ప్రవర్తిస్తున్న తీరు అంతర్జాతీయ శాంతికి భంగం కల్గించేలా ఉందని షరీఫ్ ఆరోపించారు.
మరోవైపు 'ప్రపంచ స్పీకర్ల సదస్సు'లో పాకిస్థాన్పై భారత్ విరుచుకుపడింది. పాక్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ ముర్తజా జావేద్ అబ్బాస్ మాట్లాడుతూ, కాశ్మీర్ ప్రజలు స్వయం నిర్ణయాధికారాన్ని వ్యక్తపరిచే సమయం ఆసన్నమైందని... అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ వ్యాఖ్యల పట్ల భారత్ తీవ్రంగా స్పందించింది.