పాకిస్థాన్లో విపక్షాల ఆందోళన పర్వానికి తెరదించేందుకు ప్రధాని నవాజ్ షరీఫ్ నడుం బిగించారు. ఈ క్రమంలో తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ను కలవాలని నిర్ణయించుకున్నారు. పదవి నుంచి తప్పుకోకపోతే షరీఫ్ నివాసంపై లక్షలాది మందితో దాడి చేస్తామని ఇమ్రాన్ హెచ్చరించడం తెలిసిందే.